జగిత్యాల జిల్లాలో విజృంభిస్తొన్న కరోనా

జగిత్యాల జిల్లాలో విజృంభిస్తొన్న కరోనా

జగిత్యాల జిల్లాలో వలస కార్మికులతో కరోనా విజృంభిస్తోంది. ముంబై నుంచి వచ్చిన మరో 12 మంది వలస కూలీలకు ఇవాళ కరోనా సోకినట్లు అధికారులు  నిర్ధారించారు.  మల్యాల మండలంలో ఆరుగురికి, మేడిపల్లి మండలంలో ముగ్గురికి, గొల్లపల్లి, కోరుట్ల, కథలాపూర్ మండలాలలో ఒక్కొక్కరి చొప్పున కరోన కేసులు నమోదయ్యాయి. ఇలా ఉంటే జిల్లాలో ఇప్పటివరకు 54 కేసులు నమోదు కాగా 49యాక్టీవ్ కేసులున్నాయి. వారిలో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు మృతి చెందారు.