విజయానికి 5 వికెట్ల దూరంలో భారత్

విజయానికి 5 వికెట్ల దూరంలో భారత్

భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 45 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. కివీస్ విజయం సాధించాలంటే ఇంకా 400 పరుగులు చేయాలి. కివీస్ బ్యాట్స్ మెన్ డారీ మిచెల్ 60 మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ప్రస్తుతానికి హెన్రీ నికోలస్ 36, రాచిన్ రవీంద్ర 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 3, అక్షర్ పటేల్ కు ఒక వికెట్ పడ్డాయి. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆలౌటవ్వగా.. రెండో ఇన్నింగ్స్ 276/7 కు డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ 62 పరుగులకు ఆలౌట్ అయ్యింది.