మూడో వ‌న్డే..మొద‌టి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

మూడో వ‌న్డే..మొద‌టి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో మూడు వ‌న్డేల సిరీస్ లో భాగంగా చివ‌రి మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఆదివారం కేప్‌టౌన్ వేదిక‌గా  తుది స‌మ‌రానికి టీమిండియా సిద్ద‌మైంది. ఇప్పటికే వ‌న్డే సిరీస్‌ను కోల్పోయిన భార‌త్‌.. చివ‌రి వ‌న్డేలోనైనా నెగ్గి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భార‌త్ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నాలుగు మార్పులతో భార‌త్ బ‌రిలోకి దిగ‌గా, ప్రోటిస్ ఒకే ఒక మార్పు చేసింది. జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ తుదిజ‌ట్టులోకి వ‌చ్చారు. మూడు ఓవ‌ర్లు ముగిసేస‌మ‌యానికి సౌతాఫ్రికా వికెట్ న‌ష్టానికి 19 ర‌న్స్. 


భార‌త తుది జ‌ట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

దక్షిణాఫ్రికా: క్వింటన్‌ డికాక్‌, జానేమన్‌ మలన్‌, ఎయిడెన్‌ మార్కరమ్‌, రసీ  వాన్‌ డెర్‌ డసెన్‌, తెంబా బవుమా(కెప్టెన్‌), డేవిడ్‌ మిల్లర్‌, ఆండిలే ఫెహ్లూక్వాయో, మ‌గాలా, కేశవ్‌ మహరాజ్‌, డ్వైన్ ప్రిటోరియస్, లుంగి ఎండ్వైన్ ప్రిటోరియస్గిడి.