వదలని వరుణుడు : భారత్, న్యూజిలాండ్‌కు చెరో పాయింట్

వదలని వరుణుడు : భారత్, న్యూజిలాండ్‌కు చెరో పాయింట్

 ట్రెంట్ బ్రిడ్జ్ : వరల్డ్ కప్ లో మరో మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. గురువారం జరగాల్సిన ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ టాస్ పడకుండానే క్యాన్సిల్ అయ్యింది. ఉదయం నుంచే ట్రెంట్ బ్రిడ్జ్ గ్రౌండ్ ను వరుణుడు వదలకపోవడంతో మ్యాచ్ క్యాన్సిల్ అవక తప్పలేదు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వర్షం కాస్త గ్యాప్ ఇవ్వడంతో మ్యాచ్‌పై అందరికీ ఆశలు చిగురించినప్పటికీ.. వర్షం మళ్లీ రావడంతో మ్యాచ్‌ ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30కు గ్రౌండ్‌ను తనిఖీ చేసిన అంపైర్లు.. మ్యాచ్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మ్యాచ్ క్యాన్సిల్ కావడంతో భారత్, న్యూజిలాండ్‌కు చెరో పాయింట్ దక్కింది. 16న పాక్ తో భారత్ మ్యాచ్ జరగనుంది.