స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు భారత దేశం (Independence Day 2023 )సిద్దమైంది. ప్రతి భారతీయుడు మువ్వన్నెల జెండా ఎగురవేసేందుకు సిద్దమవుతున్నారు. ప్రతి ఇంటికి త్రివర్ణ ప్రచారం కోసం జాతీయ జెండాల(indian national flag)ను అందించేందుకు పోస్టాఫీసులు వేదిక కానున్నాయి. పోస్టాఫీసుల్లో జాతీయ జెండాలను కేవలం 25 రూపాయిలకే విక్రయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఇప్పుడు భారతదేశం 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. హర్ ఘర్ తిరంగా ప్రచారం 2.0లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో భారత జాతీయ జెండాలను విక్రయిస్తున్నారు. పౌరులందరూ తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. తపాలా శాఖ తన వెబ్ పోర్టల్ ద్వారా జాతీయ జెండాను ఆన్లైన్లో విక్రయించనున్నట్లు ప్రకటించింది.
- ALSO READ: ఎంపీల క్రికెట్కు బీసీసీఐ విరాళం
ఆల్-ఇండియా రేడియో న్యూస్ అధికారిక ట్వీట్ ప్రకారం...దేశ వ్యాప్తంగా లక్షా 60 వేల పోస్టాఫీసుల్లో జాతీయ జెండాలను విక్రయిస్తోంది. ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ప్రతి ఇంటికీ ప్రభుత్వం త్రివర్ణ పతాక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా జాతీయ జెండాలను పొందాలనుకునేవారు డిపార్ట్మెంట్ ఇ -పోస్టాఫీసు ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రతి ఇంటి త్రివర్ణ ప్రచారం 13 ఆగస్టు నుంచి 15 ఆగస్టు 2023 వరకు కొనసాగుతుంది.
ఆన్లైన్లో జెండాను ఎలా కొనుగోలు చేయాలి?
- పోస్టాఫీసు వెబ్సైట్ లో .. హర్ గర్ తిరంగ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి
- ప్రొడక్ట్లు కింద జాతీయ పతాకం పై క్లిక్ చేయాలి
- కొనుగోలుపై క్లిక్ చేసి మొబైల్ నంబర్ను మళ్లీ నమోదు చేయాలి
- మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి
- ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఎంపికపై క్లిక్ చేయండి..
- చెల్లింపు విధానాన్ని ఉపయోగించి రూ. 25 చెల్లించండి..
త్రివర్ణ పతాకాన్ని ఇండియా పోస్ట్ ఆఫీస్ నుంచి ఆఫ్లైన్లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. దీని కోసం చేయాల్సిందల్లా..మీరు త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయడానికి సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి..నామమాత్రపు ధరకు అంటే కేవలం రూ.25 చెల్లించి జాతీయ జెండా పొందవచ్చు..లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.