- ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ 365 పరుగులకు ఆలౌట్
- నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న వాషింగ్టన్ సుందర్
మోతెరా స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఫోర్త్ టెస్టులో భారత్ 365 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ప్రారంభించిన వాషింగ్టన్ సుందర్ (96), అక్షర్ పటేల్లు (43)కాసేపు నిలకడగా ఆడారు.
బెన్ స్టోక్స్ బౌలింగ్లో అక్షర్ 43 పరుగుల వద్ద రన్ అవుట్ కావడంతో వాషింగ్టన్ సుందర్కు జోడి విడిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్లు కూడా బెన్ స్టోక్స్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగారు. ఎంతో చక్కగా రాణించిన వాషింగ్టన్ సుందర్ నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 205 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇండియా 365 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ మీద 160 పరుగుల లీడ్ సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ చెలరేగి ఆడాడు. బాల్ టు బాల్ ఆడిన పంత్ 118 బంతులలో 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.