కరోనాపై పోరులో ఇండియా మెరుగైన స్థితిలో ఉందా?

కరోనాపై పోరులో ఇండియా మెరుగైన స్థితిలో ఉందా?

న్యూఢిల్లీ: కరోనాతో యుద్ధంలో ఇండియా మెరుగైన స్థితిలో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కరోనాపై పోరును సంకల్పం, మరింత ఉత్సాహంతో సాగిస్తామని అమిత్‌ షా చెప్పిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఇండియా మంచి పొజిషన్‌లో ఉందా అంటూ రాహుల్ ప్రశ్నించారు. అమెరికా, ఇండియా, సౌత్ కొరియా, న్యూజిలాండ్‌ల్లో కరోనా కేసుల సంఖ్యను చూపుతున్న గ్రాఫ్‌ను రాహుల్ ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు కరోనాతో యుద్ధంలో ఇండియా మంచి స్థితిలో ఉందా? అనే క్యాప్షన్‌ను రాహుల్ జత చేశారు. ఎల్‌వోసీ వెంబడి ఉద్రిక్తతలతోపాటు కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ తీరును, ప్రధాని మోడీని టార్గెట్‌గా చేసుకుంటూ రాహుల్ పలుమార్లు విమర్శలకు దిగారు.