బీజింగ్ లో జరిగే వింటర్ ఒలింపిక్స్ ను బాయ్ కాట్ చేసింది భారత్. ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కానీ, ముగింపు వేడుకలకు కానీ ఇండియా తరఫున రాయబారి హాజరు కాబోరని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చయోన్ తెలిపారు. 2022 వింటర్ ఒలింపిక్స్ కు గాల్వాన్ సైనికుడిని టార్చ్ బేరర్గా చైనా తయారు చేస్తుందన్న నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒలింపిక్స్ ను చైనా రాజకీయం చేయడానికి ఎంచుకోవడం విచారకరమన్నారు.
గతేడాది జూన్లో గాల్వాన్ లోయలో భారత బలగాలపై దాడి చేసేందుకు ప్రయత్నించినప్పుడు క్విఫాబావోని ఇండియన్ సోల్జర్స్ పట్టుకున్నారని ఓ వార్తా సంస్థ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో తెలిపింది. ఆ నివేదిక ప్రకారం.. గతేడాది జూన్ 15-16 తేదీల మధ్య చీకట్లో గాల్వాన్ నదిని దాటడానికి 38 మంది చైనా సైనికులు ప్రయత్నించారు. అప్పుడు భారత, చైనా దళాల మధ్య పోరాటం జరిగింది. భారత బలగాలపై దాడికి పాల్పడ్డ చైనా దళానికి క్వి ఫాబావో నాయకత్వం వహించాడు. ఈ సందర్భంగా జరిగిన పోరాటంలో గాల్వాన్ వ్యాలీలో మోహరించిన భారత బలగాల్లో స్నో లెపార్డ్ అయిన కల్నల్ సంతోష్ బాబు ఈ ఆపరేషన్ లో చనిపోయారు.
మరిన్ని వార్తల కోసం..