ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్

ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్

ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్ లను మహారాష్ట్రలోని పూణెలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ(శనివారం) అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో.. స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకుండానే మ్యాచ్ లను నిర్వహించనున్నారు.

కరోనా కొత్త కేసుల కారణంగా వన్డేలను పూణె నుంచి ఇతర ప్రాంతానికి తరలించాలనుకుంది బీసీసీఐ ఉంది. ఈ క్రమంలో సస్పెన్స్ కు మహారాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలికింది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ లను నిర్వహిస్తామని ప్రకటించింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ మార్చి 23 నుంచి 28 వరకు జరగనుంది.