IND vs AUS : సగం వికెట్లు డౌన్‌

IND vs AUS : సగం వికెట్లు డౌన్‌

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. సగం వికెట్లను కోల్పోయింది. కునెమన్‌  బౌలింగ్ లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (12) ఔట్ కాగా, ఆ తర్వాత​ అతని బౌలింగ్ లోనే శుభ్‌మన్‌ గిల్ (21) కూడా పెవిలియన్‌ చేరాడు. ఇక నాథన్‌ లైయన్‌ బౌలింగ్ లో పుజారా(1) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు  ఆ తర్వాత​ అతని బౌలింగ్ లోనే  రవీంద్ర జడేజా (4) కునెమన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన  శ్రేయస్ అయ్యర్‌ కునెమన్‌  బౌలింగ్ లో డకౌట్‌ అయ్యాడు. దీంతో 50 పరుగుల స్కోరు దాటకుండానే టీమ్‌ఇండియా ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 13.4 ఓవర్లకు గానూ టీమిండియా 56 పరుగులు చేసింది. కోహ్లీ  (15), భరత్ (3) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.