IND vs SA: సఫారీల ధాటికి చేతులెత్తేశారు.. రెండో టెస్టులో ఓటమి దిశగా టీమిండియా

IND vs SA: సఫారీల ధాటికి చేతులెత్తేశారు.. రెండో టెస్టులో ఓటమి దిశగా టీమిండియా

గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా ముందు టీమిండియా తేలిపోయింది. కనీస పోరాటం కూడా లేకుండా చేతులెత్తేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమై ఓటమి అంచుల్లో నిలిచింది. నాలుగో రోజు ఆటలో భాగంగా మొదట బౌలింగ్ లో విఫలమైన భారత జట్టు.. ఆ తర్వాత భారీ ఛేజింగ్ లో కూడా ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. నాలుగో రోజు అట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజ్ లో సాయి సుదర్శన్ (2), కుల్దీప్ యాదవ్ (4) ఉన్నారు. టీమిండియా గెలవాలంటే చివరి రోజు 522 పరుగులు చేయాలి. మరో వైపు ఇంగ్లాండ్ విజయానికి 8 వికెట్లు అవసరం. 

549 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు జైశ్వాల్, రాహుల్ తమ పేలవ ఫామ్ కొనసాగించారు. ఆరంభంలో జైశ్వాల్ ఫోర్, సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించినా జాన్సెన్ బ్రేక్ లు వేశాడు. ఒక సూపర్ డెలివరీతో 13 పరుగుల వద్ద జైశ్వాల్ ను ఔట్ చేశాడు. ఆ కాసేపటికే స్పిన్నర్ హార్మర్..భారత జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అద్భుతమైన డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో నైట్ వాచ్ మెన్ గా కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ కు వచ్చాడు. సాయి సుదర్శన్, కుల్దీప్ మరో వికెట్ పడకుండా నాలుగో రోజును ముగించారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, హార్మర్ తలో వికెట్ పడగొట్టారు. 

తొలి సెషన్ లో మూడు వికెట్లు:
 
వికెట్ నష్టపోకుండా 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి సెషన్ లో 81 పరుగులు రాబట్టింద. తొలి సెషన్ ఆరంభంలో సౌతాఫ్రికా ఓపెనర్లు మార్కరం, రికెల్ టన్ జాగ్రత్తగా ఆడారు. ఓపిగ్గా ఆడుతూ ఈ సిరీస్ లో మరోసారి జట్టుకు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 59 పరుగులు జోడించారు. ఎట్టకేలకు వీరి జోడీని జడేజా విడగొట్టాడు. జడేజా బౌలింగ్ లో సిరాజ్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కు రికెల్ టన్ ఔట్ కావడంతో సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. కాసేపటికే మార్కరం (29)తో పాటు కెప్టెన్ బవుమా (3) కూడా ఔట్ కావడంతో సౌతాఫ్రికా 77 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. 

మార్కరంను ఒక స్టన్నింగ్ డెలివరీతో జడేజా క్లీన్ బౌల్డ్ చేస్తే.. బవుమాను సుందర్ బోల్తా కొట్టించాడు. ఈ దశలో సౌతాఫ్రికా జట్టును ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జీ ముందుకు తీసుకెళ్లారు. టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంటూ టీ విరామం వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీసుకున్నాడు. సుందర్ కు ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 489 పరుగులు చేస్తే.. ఇండియా 201 పరుగులకు ఆలౌటైంది. దీంతో సఫారీలకు తొలి ఇన్నింగ్స్ లో 288 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది.  

500 పరుగులు దాటిన సౌతాఫ్రికా ఆధిక్యం: 

3 వికెట్ల నష్టానికి 107 పరుగులతో నాలుగో రోజు రెండో సెషన్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఈ సెషన్ లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 113 పరుగులు చేసింది. స్టబ్స్, టోనీ డి జోర్జీ రెండో టీ విరామం తర్వాత కూడా తమ నిలకడ చూపించారు. ఒక్కో పరుగు జోడిస్తూ జట్టు ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా ఆధిక్యం 450 పరుగులు దాటింది. నాలుగో వికెట్ కు 101 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు వీరి భాగస్వామ్యాన్ని జడేజా విడగొట్టాడు. 49 పరుగుల వద్ద జొర్జీని జడేజా ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత స్టబ్స్, ముల్లర్ మరో వికెట్ పడకుండా లంచ్ కు వెళ్లారు. అప్పటికే సౌతాఫ్రికా ఆధిక్యం 500 పరుగులు దాటింది. స్టబ్స్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు