WTC Points Table: నాలుగో స్థానానికి పడిపోయిన టీమిండియా.. WTC లేటెస్ట్ పాయింట్స్ టేబుల్‌ ఇదే!

WTC Points Table: నాలుగో స్థానానికి పడిపోయిన టీమిండియా.. WTC లేటెస్ట్ పాయింట్స్ టేబుల్‌ ఇదే!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 లో భాగంగా లేటేస్ట్ పాయింట్స్ టేబుల్ లో ఇండియా నాలుగో స్థానానికి పడిపోయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓటమి తర్వాత మూడో స్థానంలో ఉన్న టీమిండియా (54.17) ఒక స్థానం దిగజారి నాలుగో ర్యాంక్ తో సరిపెట్టుకుంది. మరోవైపు సౌతాఫ్రికా రెండో స్థానానికి ఎగబాకింది. తొలి టెస్టుకు ముందు నాలుగో స్థానంలో ఉన్న సఫారీలు టీమిండియాపై విజయంతో 66.67 పాయింట్ల శాతంతో టాప్-2కు దూసుకెళ్లారు. ఒకవేళ ఇండియా చివరి టెస్టులో కూడా ఓడిపోతే పాకిస్థాన్ కంటే కిందకు వచ్చి ఐదో ర్యాంక్ లో ఉంటుంది.  

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకొని మూడో స్థానంలో నిలిచిన టీమిండియా.. ఆ తర్వాత వెస్టిండీస్ పై రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి మూడో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. విండీస్ పై రెండో టెస్టులో విజయం తర్వాత పాయింట్ల శాతం (PCT) 55.56 నుండి 61.90కి పెరిగింది. పాయింట్ల శాతాన్ని పెంచుకోగలిగినప్పటికీ టాప్-2 లోకి రాలేకపోయింది. అయితే సౌతాఫ్రికాపై తొలి టెస్ట్ ఓటమితో నాలుగో ర్యాంక్ కు పడిపోయింది. గౌహతి వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధిస్తే సౌతాఫ్రికా నాలుగు.. ఇండియా మూడో స్థానానికి వస్తుంది.   

వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా జూలై నెలలో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో విజయం సాధించిన తర్వాత అగ్రస్థానంలో కొనసాగుతుంది. సౌతాఫ్రికా, శ్రీలంక వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్ ఐదు, ఇంగ్లాండ్ ఆరు, బంగ్లాదేశ్ ఏడో స్థానంలో నిలిచాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్‌లో 5 టెస్టు మ్యాచ్ లాడిన విండీస్ జట్టు ఐదు మ్యాచ్ ల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. ఇండియా ఇప్పటివరకు డబ్ల్యూటీసిలో 8 టెస్ట్ మ్యాచ్ లాడింది. వీటిలో నాలుగు గెలిచి మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఓవరాల్ గా 54.17 పాయింట్లతో నాలుగో స్థానంలో స్థానంలో ఉంది.