ఫ్రాన్స్కు చెందిన యుద్ధ విమానాల సంస్థ డసాల్ట్తో అగ్రిమెంట్ లో భాగంగా మొదటి 36 విమానాలను భారత్కు అక్టోబర్ 8న చేరనున్నాయి. రఫేల్ విమానాలను ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫ్రాన్స్కు బయలుదేరనున్నారు.
అక్టోబర్ 8న దసరా కావడంతో ఆ రోజును ఎంపిక చేసుకున్నట్లు భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఫ్రాన్స్ విమానాలను స్వీకరించిన తర్వాత రాజ్నాథ్ సింగ్ ఒక శిక్షణ విమానంలో ప్రయాణించి పరిశీలించనున్నారు.
రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ గతంలో 36 రఫేల్ యుద్ధ విమానాలకు ఫ్రాన్స్కు చెందిన సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత మళ్లీ వచ్చే ఏడాది ప్రారంభంలో మరో 36 విమానాలను కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది భారత్.