సౌతాఫ్రికాలో ల్యాండ్‌ అయిన కోహ్లీసేన

సౌతాఫ్రికాలో ల్యాండ్‌ అయిన కోహ్లీసేన

జొహనెస్‌‌‌‌బర్గ్‌‌: విరాట్‌‌ కోహ్లీ కెప్టెన్సీలోని ఇండియా టెస్టు టీమ్‌‌ సౌతాఫ్రికా గడ్డపై ల్యాండ్‌‌ అయింది. మూడు టెస్టుల సిరీస్‌‌ కోసం ముంబై నుంచి స్పెషల్‌‌ ఫ్లైట్‌‌లో జర్నీ చేసిన ప్లేయర్లు, సపోర్ట్‌‌ స్టాఫ్‌‌, ఫ్యామిలీ మెంబర్స్​ గురువారం జొహనెస్‌‌బర్గ్‌‌ చేరుకున్నారు. ప్లేయర్లు ఎయిర్‌‌పోర్టులో దిగిన ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్‌‌ అకౌంట్‌‌లో పోస్ట్‌‌ చేసింది.ఎయిర్‌‌పోర్టు నుంచి టీమ్‌‌ అంతా క్రికెట్‌‌ సౌతాఫ్రికా (సీఎస్‌‌ఏ) ఏర్పాటు చేసిన హోటల్‌‌కు చేరుకుంది.  ఒక రోజు ఐసోలేషన్‌‌లో ఉండనుంది. ఈ టైమ్‌‌లో టీమ్‌‌లోని ప్రతీ మెంబర్‌‌కు మూడుసార్లు కరోనా టెస్టులు చేస్తారు. వీటిలో క్లియర్‌‌ అయితే శుక్రవారం సెంచూరియన్‌‌లోని టీమ్‌‌ హోటల్‌‌కు చేరుస్తారు. 19వ తేదీ నుంచి టీమిండియా ప్రాక్టీస్‌‌ స్టార్ట్‌‌ చేయనుంది. కరోనా నేపథ్యంలో ఈ టూర్‌‌ మొత్తం బయో బబుల్‌‌లో సాగనుంది. కాగా, టెస్టు టీమ్‌‌ వైస్‌‌ కెప్టెన్‌‌గా అపాయింట్‌‌ అయిన రోహిత్‌‌ శర్మ గాయం కారణంగా టెస్టు సిరీస్‌‌కు దూరమయ్యాడు.