IND vs ZIM: జింబాబ్వేతో జరుగుతున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత జట్టు ఇప్పటికే 2–0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో హరారే వేదికగా జరగనున్న ఆఖరి మ్యాచ్లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రభ్సిమ్రన్ సింగ్ అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి ఇది సరైన సమయమని ఆయన పేర్కొన్నారు.
అభిషేక్ శర్మ కాదు.. ఇషాన్ కిషన్కు రెస్ట్ ఇవ్వాలి:
సాధారణంగా వైఫల్యం చెందిన ఆటగాళ్లను తుది జట్టు నుంచి తప్పిస్తుంటారు. కానీ, వరుసగా విఫలమైనప్పటికీ అభిషేక్ శర్మను జట్టు నుంచి పక్కన పెట్టకూడదని ఆకాష్ చోప్రా తెలిపాడు. తొలి రెండు మ్యాచ్ల్లో (1, 8 పరుగులు) రన్స్ చేయలేకపోయినా, సిరీస్ గెలిచినందున అభిషేక్కు మూడో మ్యాచ్లోనూ ఛాన్స్ ఇచ్చి ఫామ్లోకి వచ్చేలా ప్రోత్సహించాలని తెలిపారు. దానికి బదులుగా, ఇప్పటికే తొలి మ్యాచ్లో 35, రెండో మ్యాచ్లో 81 పరుగులతో అద్భుతమైన ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్కు ఈ మ్యాచ్లో రెస్ట్ (Break) ఇవ్వాలని సూచించారు. ప్రభ్సిమ్రన్ సింగ్ వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా నిర్వహించగలడని వివరించారు.
ప్రభ్సిమ్రన్ సింగ్కి ఛాన్స్ ఇవ్వండి:
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఆకాష్ చోప్రా, ప్రభ్సిమ్రన్ సింగ్ను జట్టులోకి ఎంపిక చేసిన తర్వాత మళ్లీ ఎప్పుడు అవకాశం ఇస్తామో ఎవరికీ తెలియదని ఆకాష్ చోప్రా తెలిపాడు. ఇప్పటికే సిరీస్ మన చేతిలోనే ఉంది కాబట్టి, ప్రభ్సిమ్రన్ వంటి యువ ఆటగాడికి అర్హమైన అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత జట్టుపై ఉందన్నారు.
►ALSO READ | నేడే జింబాబ్వేతో మూడో టీ20.. ప్రిన్స్ యాదవ్ స్థానంలో ఎవరొస్తారంటే?
వన్-డౌన్లో ప్రభ్సిమ్రన్ ఆప్షన్:
ఒకవేళ ఇషాన్ కిషన్ స్థానంలో ప్రభ్సిమ్రన్ సింగ్ తుది జట్టులోకి వస్తే, ఆయన మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున నంబర్-3 స్థానంలో బ్యాటింగ్ చేసిన అనుభవం ప్రభ్సిమ్రన్కు ఉంది. యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉండగా, ప్రభ్సిమ్రన్ను వన్-డౌన్లో ఆడించడం భారత జట్టుకి కలిసి వస్తుందని చోప్రా వెల్లడించారు.
