భారత్ ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు రీ షెడ్యూల్

భారత్ ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు రీ షెడ్యూల్
  • గత సెప్టెంబరులో ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కరోనాతో వాయిదా

భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య గత సెప్టెంబరు నెలలో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ కరోనా కారణంగా అర్థాంతంరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ మ్యాచ్ జరుగుతుందా..?  లేదా?  అన్న విషయంలో సస్పెన్స్.. ఊహాగానాలకు ఎట్టకేలకు తెరదించింది ఇంగ్లండ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఆగిసోయిన ఈ మ్యాచ్ ను వచ్చే ఏడాది జులై 1వ తేదీన ఎడ్జ్ బాస్టన్ లో జరపాలని నిర్ణయించింది. ఈ టెస్టు సిరీస్ లో భారత్ 2 – 1 తేడాతో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఐదో టెస్టు జులై 1 నుంచి 5వ తేదీ వరకు జరిగిన తర్వాత 7 నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. తొలి టీ20 జులై 7న, రెండోది జులై 9న, 10న మూడో టీ20 జరుగుతాయి. ఆ తర్వాత వన్డే సిరీస్ మొదలువుతంది. జులై 12న తొలి వన్డే, 14న రెండో వన్డే, 17న మూడో వన్డే జరుగుతుంది.