భారత్ టార్గెట్ 154 పరుగులు

భారత్ టార్గెట్ 154 పరుగులు

రాంచీలో జరుగుతోన్న సెకండ్ టీ20లో భారత్ కు 154 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది న్యూజిలాండ్. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది న్యూజిలాండ్ . టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన  న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ 31, మిచెల్ 31 పరుగులతో అదరగొట్టారు.పవర్ ప్లేలో న్యూజిలాండ్ కు 64 పరుగులు లభించాయి.   మార్చ్ చాప్ మన్ 21, పిలిప్స్ 34 పరుగులతో రాణించడంతో  న్యూజిలాండ్ 20 ఓవర్లలో 153 పరుగులు చేయగల్గింది. భారత బౌలర్లలో  హర్షల్ పటేల్ 2, భువనేశ్వర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్, అశ్విన్ లకు తలో ఒక వికెట్ పడ్డాయి.