జైపూర్ లో జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్ లో భారత్ కు 165 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది న్యూజిలాండ్. ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ 42 బంతుల్లో 70 రన్స్ తో చెలరేగడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్ మిచెల్ డకౌట్ అయినా..మరో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ 70.. మార్క్ చాప్ మన్ 50 బంతుల్లో 63 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 164 పరుగులు చేయగల్గింది. భారత బౌలర్లలో అశ్విన్, భువనేశ్వర్ కుమార్ లకు తలో రెండు వికెట్లు, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ కు ఒక వికెట్ పడ్డాయి.