సౌతాంప్టన్: వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాప్రికా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి పస్ట్ బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 రన్స్ చేసింది. సఫారీలకు చుక్కలు చూపించారు భారత బౌలర్లు. చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగగా బుమ్రా 2 వికెట్లు తీశాడు. దీంతో సౌతాఫ్రికా తక్కువ స్కోరుకే పరిమితమితమైంది. ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ సౌతాఫ్రికాకు… చివర్లో వచ్చిన మొర్రీస్, రబడ సిక్సర్లు, బౌండరీలతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.
సౌతాఫ్రికా ప్లేయర్లలో..డుప్లెసిస్(38), మిల్లర్(31), ఫెలుక్వాయో(34), రబడ(31) మొర్రీస్(42) ఎక్కువ రన్స్ చేశారు.
భారత్ బౌలర్లలో..చాహల్(4), బుమ్రా(2), భువనేశ్వర్ కుమార్(2), కుల్దీప్ యాదవ్(1) వికెట్లు తీశారు.
Innings Break!
A 4-wkt haul from Chahal as #TeamIndia restrict South Africa to a total of 227/9 after 50 overs.
Updates – https://t.co/Ehv6d9cOXp #CWC19 pic.twitter.com/1zvqXKghsg
— BCCI (@BCCI) June 5, 2019