ఇండియా  VS సౌతాఫ్రికా: వర్షంతో తొలి టెస్టు రెండో రోజు ఆట రద్దు

ఇండియా  VS సౌతాఫ్రికా: వర్షంతో తొలి టెస్టు రెండో రోజు ఆట రద్దు

సౌతాఫ్రికాలోని సెంచురియన్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టులో రెండో రోజు ఆట రద్దయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఈ రోజు( సోమవారం) ఆటలో ఒక్క బంతి కూడా పడలేదు. కనీసం లంచ్ తర్వాత సెషన్ అయినా సాధ్యపడుతుందని ఆశించినా..గ్రౌండ్ లో భారీ నీరు నిలిచిపోవడంతో నిరాశ తప్పలేదు. మరోసారి భారీ వర్షం పడడంతో సూపర్ స్పోర్ట్ పార్క్ చెరువులా మారింది. దాంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు రెండో రోజు ఆట చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.  మొదటి  రోజు ఆటలో కోహ్లీ సేనదే పైచేయిగా నిలిచింది. 3 వికెట్లకు 272 పరుగులు చేసి  మొదటి రోజు ఆట ముగించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ సాధించడం తొలి రోజు ఆటలో హైలైట్. రాహుల్ 248 బంతులాడి 122 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రాహుల్ కు జోడీగా అజింక్యా రహానే 40 పరుగులతో ఆడుతున్నాడు.

అంతకుముందు, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 60 పరుగులు చేసి  ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. పుజారా డకౌట్ కాగా, కెప్టెన్ కోహ్లీ 35 పరుగులు సాధించాడు. సఫారీ బౌలర్లలో పేసర్ లుంగీ ఎంగిడి 3 వికెట్లు సాధించాడు.

మరిన్ని వార్తల కోసం..

వరంగల్ లో రెండో ఒమిక్రాన్ కేసు