కొలంబో: కరోనాతో ఇబ్బందులపాలైన టీమిండియా టీ20 సిరీస్ చేజార్చుకుంది. కొత్త కుర్రాళ్లతో కూడిన బ్యాటింగ్ లైనప్ ఘోరంగా విఫలమవ్వడంతో ఇండియా.. గురువారం జరిగిన థర్డ్ టీ20లో 7 వికెట్ల తేడాతో లంక చేతిలో ఓడింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను లంకేయులు 2–1తో సొంతం చేసుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 81/8 స్కోరు చేసింది. ఈ ఫార్మాట్లో టీమిండియాకు ఇది రెండో అత్యల్ప స్కోరు. కుల్దీప్ యాదవ్ (23 నాటౌట్) టాప్ స్కోరర్. భువనేశ్వర్ (16), రుతురాజ్ (14)మినహా అందరూ విఫలమయ్యారు. లంక బౌలర్లలో వాహిందు హసరంగ 4 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన లంక 14.3 ఓవర్లలో 82/3 స్కోరు చేసి నెగ్గింది. ధనంజయ డిసిల్వ (23 డిసిల్వా), మినోద్ భానుకా (18), హసరంగ (14 నాటౌట్) రాణించారు. రాహుల్ చహర్ 3 వికెట్లు తీసినా ఇండియాను గట్టెక్కించలేకపోయాడు.