సిరీస్​ పాయె..ఐదో టీ20లో ఇండియా చిత్తు

సిరీస్​ పాయె..ఐదో టీ20లో ఇండియా చిత్తు
  • 3-2తో సిరీస్​ నెగ్గిన విండీస్​
  • దంచికొట్టిన బ్రెండన్​ కింగ్​​
  •  సూర్య మెరుపులు వృథా

లాడెర్‌‌‌‌హిల్​ (అమెరికా): కరీబియన్‌‌ గడ్డపై రెండు సిరీస్‌‌లు గెలిచిన టీమిండియా.. షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో బోల్తా కొట్టింది. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో  బ్రెండన్‌‌ కింగ్‌‌ (55 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 85 నాటౌట్‌‌), నికోలస్‌‌ పూరన్‌‌ (32 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 4 సిక్స్‌‌లతో 47) చెలరేగడంతో ఆదివారం జరిగిన ఐదో టీ20లో విండీస్‌‌ 8 వికెట్ల తేడాతో ఇండియాకు షాకిచ్చింది. దాంతో 3–2తో సిరీస్​ సొంతం చేసుకుంది.   పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్​లో టాస్‌‌ నెగ్గిన ఇండియా 20 ఓవర్లలో 165/9 స్కోరు చేసింది. సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (45 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 61), తిలక్‌‌ వర్మ (18 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 27) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. రొమారియో షెఫర్డ్‌‌ 4 వికెట్లు తీశాడు. తర్వాత  విండీస్​ 18 ఓవర్లలో 171/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. అర్ష్‌‌దీప్‌‌, తిలక్‌‌ చెరో వికెట్‌‌ తీశారు. 
బ్రెండన్​కు ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్, పూరన్​కు  ప్లేయర్​ ఆఫ్​ ద సిరీస్​ అవార్డులు దక్కాయి.

సూర్య జోరు..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాను కరీబియన్‌‌‌‌ పేసర్లు ముప్పుతిప్పలు పెట్టారు. మూడు ఓవర్లలోపే అకీల్‌‌‌‌ హుస్సేన్ (2/24) దెబ్బకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌‌‌‌ (5), శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (9) వెనక్కి వచ్చేశారు. 17/2 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన సూర్య, తిలక్‌‌‌‌ నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌‌‌‌ను నిలబెట్టారు. సూర్య 4, 6తో టచ్‌‌‌‌లోకి రాగా, ఆరో ఓవర్‌‌‌‌లో తిలక్‌‌‌‌ 4, 6, 4, 4తో 19 రన్స్‌‌‌‌ దంచాడు. దీంతో పవర్‌‌‌‌ప్లేలో ఇండియా 51/2 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్‌‌‌‌లో భారీ సిక్స్‌‌‌‌ కొట్టిన తిలక్‌‌‌‌ 8వ ఓవర్‌‌‌‌లో రిటర్న్​ క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో మూడో వికెట్‌‌‌‌కు 49 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. తర్వాత సూర్య, సంజూ శాంసన్‌‌‌‌ (13) బౌండ్రీలు కొట్టడంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో ఇండియా స్కోరు 86/3కి పెరిగింది. 11వ ఓవర్‌‌‌‌లో పేలవ షాట్‌‌‌‌ ఆడి శాంసన్‌‌‌‌ ఔట్‌‌‌‌కాగా, కెప్టెన్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ (14) క్రీజులోకి వచ్చాడు. ఈ ఇద్దరు సింగిల్సే తీయడంతో ఇన్నింగ్స్‌‌‌‌లో వేగం తగ్గింది. చివరకు రెండు భారీ సిక్సర్లతో సూర్య 38 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించినా తిరిగి ప్రారంభమైన తర్వాత షెఫర్డ్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు 17వ ఓవర్‌‌‌‌లో సిక్స్‌‌‌‌ కొట్టిన హార్దిక్‌‌‌‌ను, తన తర్వాతి ఓవర్‌‌‌‌లో అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ (8), కుల్దీప్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేస్తే మధ్యలో హోల్డర్‌‌‌‌ (2/36).. సూర్య, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (13)ను వెనక్కి పంపడంతో ఇండియా  కష్టంగా 160 మార్కు దాటింది.  

కింగ్​ ధనాధన్​

వర్ష సూచన ఉండటంతో ఛేజింగ్‌‌ను విండీస్‌‌ వేగంగా ఆరంభించింది. 6, 4తో ఖాతా తెరిచిన మేయర్స్‌‌ (10)ను రెండో ఓవర్‌‌లోనే అర్ష్‌‌దీప్‌‌ (1/20) పెవిలియన్‌‌కు పంపాడు. కానీ బ్రెండన్‌‌ కింగ్‌‌, పూరన్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించారు. మూడు సిక్సర్లతో పూరన్​ టచ్‌‌లోకి వస్తే, నాలుగో ఓవర్‌‌లో కింగ్‌‌ 4, 6 దంచాడు. ఆరో ఓవర్‌‌లో మళ్లీ దీన్ని రిపీట్‌‌ చేయడంతో పవర్‌‌ప్లేలో విండీస్‌‌ 61/1 స్కోరు చేసింది. పవర్‌‌ప్లే ముగిసిన తర్వాత ఎక్కువగా సింగిల్స్‌‌ తీసిన ఈ జోడీ ఓవర్‌‌కు ఓ ఫోర్‌‌ ఉండేలా ఆడింది. నాలుగు ఓవర్లలో 35 రన్స్‌‌ రావడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో కరీబియన్లు 96/1 స్కోరు చేశారు. 11వ ఓవర్‌‌లో పూరన్‌‌ సిక్స్‌‌ కొడితే, 13వ ఓవర్‌‌లో కింగ్‌‌ సిక్స్‌‌తో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ దశలో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. తిరిగి ప్రారంభమైన తర్వాత 14వ ఓవర్‌‌లో తిలక్‌‌.. పూరన్‌‌ను బోల్తా కొట్టించాడు. దీంతో రెండో వికెట్‌‌కు 107 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 16వ ఓవర్‌‌లో కింగ్‌‌ రెండు సిక్సర్లతో రెచ్చిపోగా, హోప్‌‌ (13 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 1 సిక్స్‌‌తో 22 నాటౌట్‌‌) క్యాచ్‌‌ ఔట్‌‌ నుంచి బయటపడ్డాడు. ఆ వెంటనే కింగ్‌‌ 4, 6, 6 బాదగా.. హోప్​ సిక్స్​తో మ్యాచ్​ ముగించాడు.