టోక్యో పారాలింపిక్స్ లో భారత ప్యాడ్లర్ భావినా సంచలనం

టోక్యో పారాలింపిక్స్ లో భారత ప్యాడ్లర్ భావినా సంచలనం

టోక్యో పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ లో భారత ప్యాడ్లర్ భావినా బెన్ పటేల్ సంచలనం విజయంతో  ప్రి క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్  క్లాస్ -4 పోరులో 3 - 1  తేడాతో విజయదుందిభి మోగించింది. హోరా హోరీగా సాగిన ఈ మ్యాచులో గ్రేట్ బ్రిటన్ కు చెందిన మేగన్ షక్లెటన్ పై 11-7,9-11,17-15,13-11 తేడాతో విజయం సాధించింది.   
నిన్న బుధవారం జరిగిన తొలి రౌండు పోరులో ఓడిన భావినా తప్పక గెలవాల్సిన ఈ మ్యాచులో పట్టుదలగా ఆడి సంచలనం విజయం సాధించింది. తొలి రౌండులో భావినా అటాకింగ్ కు చేతులెల్తేసిన మేగస్ షక్లెటన్ అదను చూసి ఎదురుదాడి ప్రారంభించింది. దీంతో స్కోరు 1-1 తేడాతో సమం కావడంతో ఒకింత కలవరపాటుకు గురైన భావినా.. నిరాశకు గురికాకుండా పట్టుదలతో ఆడి పై చేయి సాధించింది. మూడు పాయింట్లతో ప్రిక్వార్టర్స్ కు దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం భావినా మీడియాతో మాట్లాడుతూ నిన్నటి ఓటమి ప్రభావం ఈ మ్యాచుపై పడకుండా జాగ్రత్తపడ్డానని.. ప్రత్యర్థి పై దాడి చేయడంపైనే దృష్టిపెట్టి ఆడడం వల్ల విజయం సాధించగలిగానని చెప్పింది. మునుముందు టోర్నీలో ఇదే తరహా ఆటతీరును కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు భావినా ప్రకటించింది.