న్యూఢిల్లీ: ఇండియన్ స్టాక్ మార్కెట్ గ్లోబల్గా ఐదో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్గా స్థానం దక్కించుకుంది. అదానీ సంక్షోభంతో ఆరో ప్లేస్కి పడిపోయినా, తిరిగి పుంజుకొని ఐదో ప్లేస్కు చేరుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ వాల్యూ 3.15 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఫ్రాన్స్, యూకే ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఆరు, ఏడు ప్లేస్లలో నిలిచాయి. ప్రతి దేశంలోని ఐపీఓకి వెళ్లిన కంపెనీల మార్కెట్ క్యాప్ను లెక్కించి ఈ డేటాను బ్లూమ్బర్గ్ రెడీ చేసింది. దేశంలోని కార్పొరేట్ కంపెనీల రిజల్ట్స్ మెరుగ్గా ఉంటుండడంతో దేశ షేరు మార్కెట్ మిగిలిన దేశాల మార్కెట్ల కంటే మంచి పెర్ఫార్మెన్స్ చేస్తోంది. అయినప్పటికీ, కిందటి నెల 24 న అంటే అదానీపై హిండెన్బర్గ్ రిపోర్ట్ వెలువడిన రోజుతో పోలిస్తే బెంచ్మార్క్ ఇండెక్స్లు ఇంకా 6 శాతం దిగువనే ట్రేడవుతున్నాయి.
ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పెంచేందుకు అదానీ గ్రూప్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంటుండడంతో గత కొన్ని సెషన్లుగా ఈ గ్రూప్ కంపెనీల షేర్లు రికవరీ అవుతున్నాయి. కానీ, అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ ఆల్టైమ్ హై నుంచి సుమారు 120 బిలియన్ డాలర్ల తక్కువలో ఉంది. కిందటేడాది నవంబర్ నుంచి దేశ మార్కెట్లో నికర అమ్మకం దారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు, ఈ నెలలో 9 వ తేదీ వరకు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తక్కువగా పెంచుతామనే సంకేతాలను ఇవ్వడం, ప్రభుత్వం క్యాపెక్స్ కోసం బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరపడం వంటి కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లు నెట్ బయ్యర్లుగా మారారని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇండియా కార్పొరేట్ కంపెనీల లాభాలు రెండెంకెల గ్రోత్ సాధిస్తాయని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఇండెక్స్లోని ఇండియన్ కంపెనీల ఎర్నింగ్స్ ఈ ఏడాది 14.5% పెరుగుతాయని పేర్కొంది. ఇలాంటి గ్రోత్నే చైనా కంపెనీలు కూడా సాధిస్తాయని, యూఎస్, యూరప్ కంపెనీల గ్రోత్ ఫ్లాట్గా ఉంటుందని పేర్కొంది.
టాప్ స్టాక్ మార్కెట్స్
స్టాక్ మార్కెట్ వాల్యూ (సుమారుగా) (ట్రిలియన్ డాలర్లలో)
1) యూఎస్ 43.25
2) చైనా 11.03
3) జపాన్ 5.75
4) హాంకాంగ్ 5.73
5) ఇండియా 3.15
6) ఫ్రాన్స్ 3.14
7) యూకే 3.05
సోర్స్: బ్లూమ్బర్గ్