దుబాయ్ రియల్ ఎస్టేట్ లో భారతీయులే టాప్ 

దుబాయ్ రియల్ ఎస్టేట్ లో భారతీయులే టాప్ 

ప్రపంచంలో ఏ దేశానికి వెల్లినా ఎక్కడో అక్కడ భారతీయులు కనిపిస్తారు. వ్యాపారాలు, కీలక పదవులు ఇలా అనే విధాలుగా భారతీయులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. ప్రస్తుతం దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలోనూ మనవాళ్లదే హవా కొనసాగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దుబాయ్ రియల్ పెట్టుబడుల్లో భారతీయులు టాప్ లో ఉన్నారట. లేటెస్ట్ గా విడుదలైన దుబాయ్ ల్యాండ్ డిపార్ట్ మెంట్ నివేదికలో ఈ విషయాలు తెలిశాయి.

అక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో 5,246 మంది భారతీయులు పెట్టుబడులు పెట్టారట. గల్ఫ్ దేశాల వారు కూడా ఈ విషయంలో మనవాళ్ల తర్వాతే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందినవారు 5,172 మంది రియల్ పెట్టుబడుల రంగంలో ఉన్నారు.

సౌదీ అరేబియా నుంచి 2,198 మంది, చైనా నుంచి 2,096 మంది, బ్రిటన్ నుంచి 2,088 నుంచి, పాకిస్తాన్ నుంచి 1,913 మంది, ఈజిప్ట్ నుంచి 955 మంది, జోర్డాన్ నుంచి 855 మంది, అమెరికా నుంచి 682 మంది, కెనడా నుంచి 678 మంది దుబాయ్ రియల్ రింగంలో పెట్టుబడులు పెట్టినట్టు ఈ నివేదిక చెబుతోంది.

భారతీయులు సంఖ్యాపరంగానే కాదు, పెట్టుబడి విలువ పరంగానూ టాప్ లోనే ఉన్నారు. పెట్టుబడి విలువ 10.89 బిలియన్ దిర్హామ్స్ కాగా, ఎమిరేట్ వాసులు 8.1 బిలియన్ దిర్హామ్స్ తో రెండోస్థానంలో ఉన్నారు.