హైదరాబాద్: ఇండియాలో తొలి ఫార్ములా ఈ రేస్కు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్క్, ప్రసాద్ ఐమ్యాక్స్ చుట్టూ 2.83 కిలోమీటర్ల ట్రాక్ను పూర్తి చేశారు. ట్రాక్పై రేస్ డ్రైవర్లు సంతృప్తి వ్యక్తం చేసినా, సర్క్యూట్ చుట్టూ వర్క్ ఇంకా పెండింగ్లో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. గ్యారేజీల కోసం కొన్ని శాశ్వత కట్టడాలను నిర్మించగా, చాలా మౌలిక సదుపాయాలను తాత్కాలికంగా కల్పించారు. గెలిచిన డ్రైవర్లు సెలబ్రేషన్స్ చేసుకునే పోడియం పనులు ఇంకా పూర్తి కాలేదు. రేస్లో పాల్గొనే టీమ్స్ తమ కార్లను గ్యారేజ్లో పార్క్ చేసినా, హాస్పిటాలిటీ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం సా.4. 25 నుంచి 5.15 వరకు తొలి ప్రాక్టీస్ సెషన్ జరగనుంది. శనివారం ఉదయం 8 నుంచి 8.55 వరకు రెండో ప్రాక్టీస్ సెషన్ జరుగుతుంది. ఉదయం 10.40 నుంచి 11.55 వరకు క్వాలిఫయింగ్, మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు ప్రధాన రేస్ జరగనుంది.