ఇండోనేషియాలో విమానం మిస్సింగ్

ఇండోనేషియాలో  విమానం మిస్సింగ్

ఇండోనేషియాలో ఓ విమానం అదృశ్యమైంది. జకర్తా నుంచి ప్రయాణికులతో పాంటియానక్  వెళ్తున్నవిమానం… టేకాఫ్ అయిన 4 నిమిషాలకే రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ప్రయాణికులు, సిబ్బంది అంతా కలిపి 59మంది ఉన్నట్లు సమాచారం. జనాలు లేని ఓ ఐలాండ్ లో విమానం కూలిపోయి ఉంటుందని ఇండోనేషియా లోకల్ చానల్స్ లో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.