
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి ఐదేండ్ల జైలు శిక్ష పడింది. భువనగిరి జిల్లాకు చెందిన రామకృష్ణ సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొన్నాళ్ల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. రామకృష్ణకు ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. రూ. 2 వేలు జరిమానాగా కట్టాలని ఆదేశించింది.