అమానుష ఘటన.. మహిళా పైలట్పై మరో పైలట్ ఆత్యాచారం

అమానుష ఘటన.. మహిళా పైలట్పై మరో పైలట్ ఆత్యాచారం

హైదరాబాద్: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాబిన్ అసిస్టెంట్ మహిళా పైలట్పై అత్యాచారం జరిగిన ఘటనపై పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. మహిళా అసిస్టెంట్ పైలట్పై మరో పైలట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం బేగంపేట్ పోలీసులు బాధితురాలు ఆశ్రయించగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 20న బిజినెస్ ఫ్లైట్లో బేగంపేట నుంచి పుట్టపర్తి చెన్నై మీదుగా బాధితురాలు బెంగళూరు వెళ్ళింది. సాయంత్రం 4.20 నిమిషాలకు బిజినెస్ ఫ్లైట్ బెంగళూరు చేరుకుంది.

మహిళా అసిస్టెంట్ పైలట్తో పాటు మరో ఇద్దరు పైలెట్లు (male) బెంగళూరులోని హోటల్లో బస చేశారు. అనంతరం ఇద్దరు పైలట్లతో కలిసి బాధితురాలు బయటికి వచ్చింది. తిరిగి హోటల్ రూమ్కి వెళ్లిన తర్వాత సదరు పైలట్ తనపై అత్యాచారం చేశాడని తిరిగి హైదరాబాదుకు వచ్చిన మహిళా పైలట్ బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బేగంపేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. బెంగళూరుకు కేసును ట్రాన్స్ఫర్ చేశారు.