హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ దగ్గర వైఎస్ షర్మిల దీక్షను ప్రారంభించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. 72 గంటల పాటు షర్మిల దీక్ష నిర్వహించాలని భావిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కరోజుకు మాత్రమే అనుమతి జారీ చేసింది. దీంతో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే షర్మిల తన దీక్షను నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఆమె ఎప్పటివరకు దీక్ష చేస్తారన్న విషయంపై క్లారిటీ లేదు.
నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ఇటీవల నిర్వహించిన ఖమ్మంలో నిర్వహించిన షర్మిల సంకల్ప సభలో ఆమె ప్రకటించారు.