మే 25నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

మే 25నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. మే 25 నుంచి జూన్ 1 వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. మే 25న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకూ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. జూన్ 1తో ఈ పరీక్షలు ముగియనున్నాయి.