‘‘కర్మణ్యేవాధికారస్తే’’.. బదిలీ అనంతరం స్మితా సబర్వాల్ ట్వీట్​

‘‘కర్మణ్యేవాధికారస్తే’’.. బదిలీ అనంతరం స్మితా సబర్వాల్ ట్వీట్​
  • బదిలీ అనంతరం స్మితా సబర్వాల్ ట్వీట్​

హైదరాబాద్, వెలుగు: సీనియర్ ​ఐఏఎస్ ​ఆఫీసర్ స్మితా సబర్వాల్‌‌ బదిలీ అనంతరం ట్వీట్‌‌ చేశారు. భగవద్గీతలోని శ్లోకాన్ని తన బదిలీకి అన్వయిస్తూ.."కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన(నీకు పని చేయడానికి మాత్రమే హక్కు ఉంది. కానీ దాని ఫలితాలపై అధికారం లేదు). 4 నెలలు టూరిజం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేశాను. దీర్ఘకాలంగా పెండింగ్‌‌లో ఉన్న టూరిజం పాలసీ 2025--2030ని రాష్ట్రానికి పరిచయం చేశాను’’ అని తన ట్వీట్​లో పేర్కొన్నారు.

నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్‌‌లలో దిశ, పెట్టుబడి కోసం పటిష్టమైన ఫ్రమ్‌‌ని సృష్టించాను. డిపార్ట్‌‌మెంట్ పని శైలిని పునరుద్ధరించాను. జవాబుదారీతనం నింపడానికి ప్రయత్నించాను. లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాది వేసి- గ్లోబల్ ఈవెంట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టాను. అది నాకు ఆనందం. గౌరవంగా ఉంది’’అంటూ స్మితా తెలిపారు. ఇటీవల బదిలీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆమెను.. ఫైనాన్స్​ కమిషన్​ మెంబర్​సెక్రటరీగా పంపింది.