మార్చి 4వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు

మార్చి 4వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు

ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఇవాళ(శుక్రవారం) రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మార్చి 4 నుంచి 21 వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరుగునున్నాయి. మార్చి 5 నుంచి 23 వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి.జనవరి 28 వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్  నిర్వహించనున్నారు. జనవరి 30వ తేదీన ఎన్విరాన్ మెంట్  పరీక్ష జరుగనుందని బోర్డు అధికారులు తెలిపారు.