కరోనాతో నేషనల్ బ్యాడ్మింటన్ అంపైర్ సుధాకర్ మృతి

కరోనాతో నేషనల్  బ్యాడ్మింటన్ అంపైర్ సుధాకర్ మృతి

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ అంపైర్ సుధాకర్ కరోనాతో చనిపోయారు. హైదరాబాద్ కి చెందిన 72 ఏళ్ల సుధాకర్ మొదట సిండికేట్ బ్యాంక్ లో క్లర్కుగా  జీవితాన్ని ప్రారంభించి ఆతర్వాత బ్యాడ్మింటన్ పై ఆసక్తితో అటు వైపు వెళ్లారు. గతేడాది కూడా ఆయన కరోనా బారినపడి తిరిగి కోలుకున్నారు. సెకండ్ వేవ్ లో రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్నా.. వైరస్ నుంచి తప్పించుకోలేకపోయారు. సుధాకర్ కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మూడు ఒలింపిక్స్ లలో బ్యాడ్మింటన్ మ్యాచ్ అఫిషియల్ గా పాల్గొన్న తెలుగు వ్యక్తి వేమూరి సుధాకర్. ఎన్నో ప్రతిష్టాత్మక మ్యాచ్ లకు అంతర్జాతీయ అంపైర్ గా బాధ్యతలు నిర్వహించారు. సుధాకర్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల బ్యాడ్మింటన్ సంఘాల ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు.