జూబ్లీహిల్స్, వెలుగు: పెన్నా సిమెంట్ సంస్థకు చెందిన ప్రముఖ వ్యాపారి, ఇంటర్నేషనల్ బైక్రైడర్ రితీష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఏపీలో హార్లీ-డేవిడ్సన్ మోటార్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు రితీశ్రెడ్డి తన బీఎండబ్ల్యూ బైక్పై వెళ్లారు. ఆదివారం అదే బైక్పై బాపట్ల నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా, నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో అర్ధరాత్రి సమయంలో ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు పక్కన రితీశ్రెడ్డి మృతదేహం, బైక్ పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు బంజారాహిల్స్ వాసిగా గుర్తించి కుటుంబ సభ్యులకు అందించారు.
