ఐపీఎల్ ఫేజ్-2 సెప్టెంబర్ 19 నుంచి..

ఐపీఎల్ ఫేజ్-2 సెప్టెంబర్ 19 నుంచి..
  • షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
  • తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్

న్యూఢిల్లీ: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 ఫేజ్ 2 మ్యాచులు వచ్చే సెప్టెంబర్ 19వ తేదీ నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ 14 సీజన్లో 29 మ్యాచులు జరిగాక కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఈ సీజన్లో మరో 31 మ్యాచులు జరగాల్సి ఉంది. అయితే కరోనా సద్దుమణిగాక ఫేజ్ 2 పోటీలు నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. 
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో మిగిలిన మ్యాచుల నిర్వహణను సెప్టెంబర్ 19 నుంచి మొదలుపెడుతున్నట్లు బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. యూఏఈ వేదికగా మ్యాచులు జరపాలని నిర్ణయించినట్లు షెడ్యూల్ ను విడుదల చేసింది. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10వతేదీన మొదటి క్వాలిపైయర్ మ్యాచ్, అక్టోబర్ 11న ఎలిమినేటర్, అక్టోబర్ 13న రెండో క్వాలిఫైయర్, అక్టోబర్ 15న ఫైనల్ జరుగుతుంది.