దుబాయ్: వరుస పరాజయాలతో విసుగుపుట్టించిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఊరట విజయం లభించింది. నాలుగు మార్పులతో బరిలోకి దిగిన రైజర్స్ ఐదు ఓటముల తర్వాత గెలుపు రుచి చూసింది. టార్గెట్ ఛేజింగ్లో జేసన్ రాయ్ (42 బాల్స్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో 60) హిట్టింగ్కు తోడుగా కెప్టెన్ విలియమ్సన్ (41 బాల్స్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 51 నాటౌట్) నిలకడగా ఆడటంతో.. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 164/5 స్కోరు చేసింది. సంజూ శాంసన్ (57 బాల్స్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 82) కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టగా, యశస్వి జైస్వాల్ (36) అండగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 167/3 స్కోరు చేసి నెగ్గింది. విలియమ్సన్, అభిషేక్ (21 నాటౌట్) నాలుగో వికెట్కు 48 రన్స్ జోడించారు. రాయ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
శాంసన్ ధనాధన్..
రాజస్తాన్ ఇన్నింగ్స్కు శాంసన్ వెన్నెముకలా నిలిచాడు. ఓపెనర్ లూయిస్ (6)ను రెండో ఓవర్లోనే భువనేశ్వర్ (1/28) ఔట్ చేసినా.. యశస్వి, శాంసన్ కౌంటర్ అటాక్కు దిగడంతో పవర్ప్లేలో రాజస్తాన్ 46/1 స్కోరు చేసింది. ఆతర్వాత కూడా ఈ ఇద్దరూ జోరు కొనసాగించారు. అయితే 9వ ఓవర్లో సందీప్ (1/30) బాల్ను భారీ సిక్సర్గా మలిచిన యశస్వి నెక్స్ట్ బాల్కు క్లీన్బౌల్డ్ అవడంతో సెకండ్ వికెట్కు 56 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. 11వ ఓవర్లో టీమ్కు మరో దెబ్బ తగిలింది. మళ్లీ బౌలింగ్కు వచ్చిన రషీద్ (1/31).. లివింగ్స్టోన్ (4)ను ఔట్ చేశాడు. ఈ దశలో శాంసన్కు తోడైన మహిపాల్ లామ్రోర్ (29) నిలకడగా ఆడాడు. హోల్డర్ బాల్ను స్టాండ్స్లోకి పంపి టచ్లోకి వచ్చాడు. రెండోఎండ్లో శాంసన్.. రషీద్, సిద్దార్థ్ కౌల్ (2/36) బౌలింగ్లో భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో 41 బాల్స్లో ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు.ఈ క్రమంలో రాయల్స్ స్కోరు 150 దాటింది. అయితే, లాస్ట్ ఓవర్లో శాంసన్, రియాన్ పరాగ్ (0)ను ఔట్ చేసిన కౌల్ రాజస్తాన్ను కట్టడి చేశాడు.
రాయ్ ఓపెనింగ్.. కేన్ ఫినిషింగ్
వార్నర్ ప్లేస్లో బరిలోకి దిగిన జేసన్ రాయ్.. ఛేజింగ్లో మరో ఓపెనర్ సాహా (18)తో కలిసి హైదరాబాద్కు అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ఫోర్తో టచ్లోకి వచ్చిన సాహా.. థర్డ్ ఓవర్లో 6, 4తో 12 రన్స్ రాబట్టాడు. ఇంకోవైపు సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న రాయ్ వరుస ఫోర్లతో రెచ్చిపోయాడు. దీంతో 4.5 ఓవర్లలోనే 50 రన్స్ వచ్చేశాయి. అయితే ఆరో ఓవర్లో లామ్రోర్.. సాహాను ఔట్ చేయడంతో ఫస్ట్ వికెట్కు 57 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. పవర్ప్లేలో 63/1 స్కోరు చేసిన హైదరాబాద్ స్కోరు బోర్డును రాయ్, కేన్ విలియమ్సన్ వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఎక్కువగా సింగిల్స్ తీస్తూ 6 రన్రేట్ తగ్గకుండా చూశారు. పదో ఓవర్లో కేన్ భారీ సిక్సర్ బాదగా.. సగం ఓవర్లకు 90/1 స్కోరుతో రైజర్స్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఆపై, తెవాటియా బౌలింగ్లో రాయ్ 6, 4, 4, 4తో 21 రన్స్ పిండుకున్నాడు. కానీ, ఏడు బాల్స్ తే డాతో రాయ్, ప్రియమ్ గార్గ్ (0) వెనుదిరగడంతో రైజర్స్ ఒత్తిడిలో పడింది. ఈ టైమ్లో అభిషేక్ భారీ షాట్లకు పోకుండా స్ట్రయిక్ రొటేట్ చేశాడు. గెలవాలంటే 18 బాల్స్లో 22 రన్స్ కావాల్సిన దశలో అభిషేక్ భారీ సిక్సర్, విలియమ్సన్ ఫోర్ బాది మ్యాచ్ను తమవైపు లాగేసుకున్నారు. తర్వాతి ఓవర్లో విలియమ్సన్ రెండు ఫోర్లతో గెలుపు లాంఛనం పూర్తి చేశాడు.