గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్లోని ఓ రెస్టారెంట్ కిచెన్లో చిమ్నీ పేలడంతో మంటలు చెలరేగాయి. మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్ పక్కన ఉన్న తెలుగు నెస్ రెస్టారెంట్ కిచెన్లో సోమవారం ఒక్కసారిగా చిమ్నీ బ్లాస్ట్ అయింది.
పేలుడు ధాటికి కిచెన్లోని వంట సామగ్రి, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. ప్రమాదం జరగగానే కిచెన్ నుంచి దట్టమైన పొగ వ్యాపించింది. మాదాపూర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చిమ్నీని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడం వల్లే పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
