మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్తేదీని మారుస్తూ భారత ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారం..ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలతో పాటు మిజోరాం శాసన సభలకు జరిగిన సాధారణ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3 న జరగాల్సి ఉంది..
అయితే కౌంటింగ్ తేదీని డిసెంబర్ 3 బదులుగా డిసెంబర్ 4 కు మారుస్తూ సీఈసీ ప్రకటన విడుదల చేసింది.
కౌంటింగ్ తేదీని మార్చాలని వివిధ వర్గాల ప్రతినిధులనుంచి వచ్చిన అభ్యర్థలను పరిగణనలోకి తీసుకొని సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 3 .. మిజోరా ప్రజలు ప్రత్యేకంగా భావిస్తారు.అందుకే ప్రతినిధుల అభ్యర్థన మేరకు కౌంటింగ్ తేదీని డిసెంబర్ 4కు మార్చామని నోటిఫకేషన్ లో కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మిజోరాం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల శాసనసభకు సాధారణ ఎన్నికల కౌంటింగ్ లో ఎటువంటి మార్పులు లేవని తెలిపింది.
మిజోరాంలో నవంబర్ 7న ఒకే విడుతలో పోలింగ్ జరిగింది. 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదు అయింది.
GE to MLA, 2023 atana vote chhiar hun tura ruat December ni 3, 2023 (Pathianni) chu Election Commission of India (ECI) chuan December ni 4, 2023 (Thawhtanni) ah a sawn. pic.twitter.com/EfFU6FwNaT
— Chief Electoral Officer #Mizoram (@ceomizoram) December 1, 2023