- పార్టీకి రాజీనామా చేసిన మాదాపూర్, హఫీజ్ పేట కార్పొరేటర్లు
- నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లోకి జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు
- కాంగ్రెస్ నుంచి శేరిలింగంపల్లి టికెట్ కన్ఫమ్ అయినందునే చేరిక?
మాదాపూర్, వెలుగు : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాదాపూర్, హఫీజ్పేట డివిజన్ల కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు సోమవారం రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రకటించారు. జగదీశ్వర్గౌడ్, పూజిత దంపతులు మంగళవారం జూబ్లీహిల్స్పెద్దమ్మ గుడిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పూజలు చేసి భారీ ర్యాలీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్లో చేరనున్నారు. జగదీశ్వర్ రెడ్డి కొంతకాలంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ సిట్టింగ్ఎమ్మెల్యేకే బీఆర్ఎస్ టికెట్ఇవ్వడంతో నిరాశచెందారు.
కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అధిష్టానానికి తెలియడంతో వెంటనే బీఆర్ఎస్జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చారు. అయినా ఎమ్మెల్యే టికెట్కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తీరా ఎమ్మెల్యే గాంధీకి బీఫామ్ ఇవ్వడంతో బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు నియోజకవర్గంలోని పలువురు నేతలు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరనున్నారు.
ఎమ్మెల్యే టికెట్ కన్ఫమ్?
కాంగ్రెస్ నుంచి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ జగదీశ్వర్ రెడ్డికి కన్ఫమ్ కావడంతోనే ఆయన ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయి టికెట్ కోసం పోటీ పడుతున్న రఘునాథ్ యాదవ్కు మొండిచేయి అనే టాక్ వినిపిస్తున్నది.
ఎమ్మెల్యే గాంధీకి ఎదురుదెబ్బ...
మాదాపూర్, హఫీజ్పేట్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ను వీడటంతో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి సెగ్మెంట్లో ఎదురుదెబ్బ తగిలింది. రెండు డివిజన్లతో పాటు సెగ్మెంట్లోనూవీరికి పట్టుఉండడంతో బీఆర్ఎస్కు బిగ్షాక్ అని నేతలు పేర్కొంటున్నారు.