జగన్ సుస్థిర పాలన అందిస్తారు: పంచాంగ శ్రవణం

జగన్ సుస్థిర పాలన అందిస్తారు: పంచాంగ శ్రవణం

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభకు జరిగే ఎన్నికల్లో YCP కి అధికారం లభిస్తుందని వేద పండితులు చెప్పారు. అమరావతిలోని YCP కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. వేదపండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. YCP అధ్యక్షుడు YS  జగన్‌ సుస్థిరమైన పాలన అందిస్తారని పంచాంగ శ్రవణం సందర్భంగా వేద పండితులు చెప్పారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక హోదా సాధించగలుగుతారన్నారు. వర్షాలు బాగా కురియడంతో రైతులకు మంచి పంటలు పండుతాయని వారు చెప్పారు.

ఉగాది పర్వదినం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు. వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు శుభాకాంక్షలు తెలిపారు.