కమెడియన్ పృథ్వీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్ ..!

కమెడియన్ పృథ్వీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్ ..!

ప్రముఖ కమెడియన్ నటుడు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీకి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీని సీఎం జగన్ నియమించబోతున్నట్లు సమాచారం. ఈ  విషయమై సీఎం జగన్ ఇప్పటికే పృథ్వీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు వెల్లడించనుందని తెలుస్తోంది.

ఇంతవరకు SVBC ఛైర్మన్‌గా ఉన్న టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు  ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు. టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఏడాదిన్నర తర్వాత తన పదవికి రాఘవేంద్రరావు రాజీనామా సమర్పించారు. వయోభారం కారణంగానే ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అప్పట్లో రాఘవేంద్రరావు తెలిపారు.