30న ఒక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తా… ఏం చేస్తానో అప్పుడే చెబుతా

30న ఒక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తా… ఏం చేస్తానో అప్పుడే చెబుతా

ఈనెల 30వ తేదీన తాను ఒక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా లతో భేటీ తర్వాత.. ఏపీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా గురించి ప్రధానమంత్రితో చర్చించానని వైఎస్ జగన్ చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రిగా 30న ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినట్టు జగన్ చెప్పారు. ఈనెల 30న తాను ఒక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. వేరేమంత్రులెవరూ ప్రమాణం చేయబోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. పదిరోజుల్లోనే మంత్రివర్గాన్ని విస్తరిస్తానని చెప్పారు.

ఒక పథకంపై మొదటి సంతకంతో ఆగిపోయే పనికాదని… నవరత్నాలను ప్రజలకు అందించడానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రమాణ స్వీకారం రోజునుంచే తన పని మొదలవుతుందని అన్నారు.