TRS కార్పొరేటర్ నుంచి ప్రాణహాని ఉంది

TRS కార్పొరేటర్ నుంచి ప్రాణహాని ఉంది

హైదరాబాద్ : జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్ తమపై దాడి చేశారని బీజేపీ మహిళా నేత వసుంధర ఆరోపించారు. తమ బంధువులపై కార్పొరేటర్ దాడి చేస్తుండగా అడ్డుకోబోతే…. తనని తన చెల్లిల్లిని కొట్టారని ఆమె తెలిపారు. గతంలో కూడా కార్పొరేటర్ తమపై దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. పోలీసులు కూడా తమ కంప్లైంట్ ని తీసుకోలేదంటున్నారు. కార్పొరేటర్ నుంచి తమకు ప్రాణహాని ఉందంటున్నారు వసుంధర.