కేంద్రానివి మాటలు తప్ప చేతల్లేవ్..

కేంద్రానివి మాటలు తప్ప చేతల్లేవ్..

కేంద్ర ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు లేవన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఎందుకు లేవో చెప్పాలన్నారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధుల కంటే ఒక్క రూపాయి ఐనా అదనంగా ఇచ్చారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సాయంపై కేంద్రం నుంచి కనీస స్పందన కరువైందన్నారు. తెలంగాణ కంటే గొప్పగా పాలన ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలేవో చెప్పాలంటూ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డిది ప్రజా ఆశీర్వాద యాత్ర కాదు- ప్రజలను మోసం చేసే యాత్ర  అన్నారు. రైతు జేబులు కొట్టే చట్టాలు తెస్తున్న రైతు ద్రోహి బీజేపీ అన్నారు. కొత్తగా తెచ్చిన రైతు చట్టాల వల్ల దేశరైతుల నడ్డి విరుస్తుందన్నారు.