గ్రామసభలో వెల్గటూర్ మండల రైతుల ఆవేదన
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో అడిషినల్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభ రసాభాస గా సాగింది. ఎల్లంపల్లి టు మిడ్ మానేరు కు నీటిని తరలించే పంప్ హౌస్ నిర్మాణం లో భాగంగా కాళేశ్వరం లింక్ 2 లో తమ భూములు కోల్పోతున్నామని మండలంలోని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతే ఎలా బ్రతకాలి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తాము భూములు ఇవ్వమని, ప్రాజెక్ట్ నీళ్లు కూడా తమకు వద్దని రైతుల ఆందోళన చేశారు. గీత కార్మికులు, మత్య కార్మికుల కు తీవ్ర నష్టం జరిగుతుందని బాధితులు గొడవ చేశారు.