కన్నీటి వీడ్కోలు: ముగిసిన జైపాల్ రెడ్డి అంత్యక్రియలు

కన్నీటి వీడ్కోలు: ముగిసిన జైపాల్ రెడ్డి అంత్యక్రియలు

కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛానలతో నెక్లెస్ రోడ్డులో ముగిశాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు.. రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్, సదానందగౌడ స్వయంగా జైపాల్ రెడ్డి పాడె మోశారు.  నాయకులు, అభిమానుల అశ్రునయనాల మధ్య జైపాల్ రెడ్డి అంతిమసంస్కారాలు నిర్వహించారు.

అంతకుముందు జైపాల్ రెడ్డి పార్ధీవదేహాన్ని ఆయన ఇంటి నుంచి ర్యాలీగా గాంధీభవన్ కు తీసుకెళ్లారు. అక్కడ అభిమానులు, నేతలు ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. తర్వాత అక్కడ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు అంతిమయాత్ర నిర్వహించారు. పీవీ ఘాట్ దగ్గరే.. జైపాల్ రెడ్డి అంత్యక్రియలు జరిగాయి.

జైపాల్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు రాజకీయ ప్రముఖులు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వ్యక్తి కంటే ప్రజాస్వామ్య  వ్యవస్థకు జైపాల్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారన్న నేతలు …. దేశానికి ఆయన ఎంతో  సేవ చేశారని చెప్పారు.  జైపాల్ రెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు లీడర్స్.