సెలవియ్యనందుకే   కాల్చి చంపేశా

సెలవియ్యనందుకే   కాల్చి చంపేశా
  •      దర్యాప్తులో నిందితుడు వెల్లడించాడన్న పోలీసులు

ముంబై : ఆరోగ్యం బాగాలేదని చెప్పినా డ్యూటీ చేయాల్సిందేనని సీనియర్ ఆఫీసర్ చెప్పడంతోనే సోమవారం జైపూర్ నుంచి ముంబై వస్తున్న రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లు స్టేట్​మెంట్ ఇచ్చాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు వివరాలను రైల్వే పోలీసులు మంగళవారం మీడియాకు తెలిపారు. ‘‘చేతన్ సింగ్ సోమవారం తెల్లవారుజామున 2.53 గంటలకు డ్యూటీ చార్జ్ తీసుకున్నాడు. ఆరోగ్యం బాగాలేదు వచ్చే స్టేషన్ లో దిగిపోతానని ఏఎస్సై టికారాం మీనాతో ఉదయం 6 గంటలకు చెప్పాడు.

ఇదే విషయాన్ని సెంట్రల్ ఆఫీస్​కు ఏఎస్సై ఇన్ఫామ్ చేయగా అక్కడ్నుంచి కూడా డ్యూటీ ముగిశాకే చేతన్​ను పంపించాలని ఉత్తర్వులు వచ్చాయి. దీంతో ఏఎస్సై, చేతన్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రైఫిల్​తో చేతన్  ఏఎస్సై టికారాంను, ఆపై ప్యాసింజర్లను కాల్చి చంపేశాడు” అని పోలీసులు తెలిపారు.