- దర్యాప్తులో నిందితుడు వెల్లడించాడన్న పోలీసులు
ముంబై : ఆరోగ్యం బాగాలేదని చెప్పినా డ్యూటీ చేయాల్సిందేనని సీనియర్ ఆఫీసర్ చెప్పడంతోనే సోమవారం జైపూర్ నుంచి ముంబై వస్తున్న రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లు స్టేట్మెంట్ ఇచ్చాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు వివరాలను రైల్వే పోలీసులు మంగళవారం మీడియాకు తెలిపారు. ‘‘చేతన్ సింగ్ సోమవారం తెల్లవారుజామున 2.53 గంటలకు డ్యూటీ చార్జ్ తీసుకున్నాడు. ఆరోగ్యం బాగాలేదు వచ్చే స్టేషన్ లో దిగిపోతానని ఏఎస్సై టికారాం మీనాతో ఉదయం 6 గంటలకు చెప్పాడు.
ఇదే విషయాన్ని సెంట్రల్ ఆఫీస్కు ఏఎస్సై ఇన్ఫామ్ చేయగా అక్కడ్నుంచి కూడా డ్యూటీ ముగిశాకే చేతన్ను పంపించాలని ఉత్తర్వులు వచ్చాయి. దీంతో ఏఎస్సై, చేతన్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రైఫిల్తో చేతన్ ఏఎస్సై టికారాంను, ఆపై ప్యాసింజర్లను కాల్చి చంపేశాడు” అని పోలీసులు తెలిపారు.