భారతదేశంలో ధైర్యంగా.. స్వేచ్చగా జీవిస్తున్నారంటే అందుకు కారణం భారత సైన్యం అందిస్తున్న సేవల వల్లే. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి.. దేశ ప్రజలని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. శత్రువులు దేశంలోకి చొచ్చుకొని రాకుండా 24గంటల పాటు కాపలా ఉంటున్నారు. వారి ధైర్య సాహసాలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మంచుకొండలు, ఎడారులు, గడ్డ కట్టే చలి.. లోయల్లో.. నిద్రాహారాలు మాని భద్రతలో ఉంటారు. ఒక్కోసారి శత్రువులు చేసే దాడుల్లో... వీర మరణం పొందుతారు. వారు ఎలాంటి సేవలు చేశారనే దానిపై సినిమాలు రూపొందిస్తుంటారు. ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. తాజాగా మేజర్ అనే సినిమా వచ్చింది. ముంబయిలో జరిగిన 26/11 దాడిలో వీర మరణం పొందిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ‘మేజర్’ సినిమా రూపొందింది. ఈ సినిమాలో ‘అడివి శేష్’ ప్రధాన పాత్రలో నటించారు.
ఈ సినిమా జూన్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే విడుదలకు ముందే.. సినిమా ప్రివ్యూలను ప్రదర్శిస్తున్నారు. సినిమా చూస్తూ.. ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. జైపూర్ లో ‘మేజర్’ సినిమా ప్రివ్యూ వేశారు. సినిమా చూస్తున్న సమయంలో ప్రేక్షకులు కంటతడి పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సినిమా హాల్ లో ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ కనిపించారు. ఈ వీడియోను ట్విట్టర్ లో హీరో ‘అడివి శేష్’ పోస్టు చేశారు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణ అమర్ రహే, తన జీవితంలో ఇదొక అద్భుత క్షణంగా అభివర్ణించారాయన. మేజర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శోభితా కూడా ఎమోషనల్ అయ్యారు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కి తమ బృందం పెద్ద ఫ్యాన్ అని తెలిపారు. అతని కథ ప్రజలకు చేరువ కావాలని తాము కోరుకోవడం జరుగుతుందన్నారు. తెలుగు, హిందీ, మళయాళం భాషల్లో జూన్ 03వ తేదీన విడుదల కానుంది.
#Jaipur First time we saw people in the theater scream along with the film. #MajorSandeepUnnukrishnan AMAR RAHE! Massive moment in my career. Watch this! #MajorOnJune3rd pic.twitter.com/5W81GHm6jX
— Adivi Sesh (@AdiviSesh) May 28, 2022
మరిన్ని వార్తల కోసం : -
‘మేజర్’ సినిమాపై అడివి శేషుతో చిట్ చాట్
రాకీ భాయ్లా మారాలని.. గంటకు 20 సిగరెట్లు కాల్చిండు