ఈశాన్యంలో హింస పెరుగుతోంది: జైరాం

ఈశాన్యంలో హింస పెరుగుతోంది: జైరాం

న్యూఢిల్లీ: ఈశాన్యంలోని వివిధ ప్రాంతాల్లో శాంతి, భద్రతలు క్షీణిస్తున్నాయని, హింస పెరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. శనివారం అస్సాంలోని  నేషనల్ పార్కులో ప్రధాని మోదీ పర్యటించడం పట్ల ఆయన  విమర్శలు గుప్పించారు. 

‘‘మణిపూర్ లో ఏడాదిగా సివిల్ వార్ కొనసాగుతోంది. అల్లర్లతో హింసాత్మకంగా మారింది. వేలాది మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయినా, ఆ రాష్ట్రంలో పర్యటించడానికి ప్రధానికి సమయం దొరకలేదా” అని జైరాం  ప్రశ్నించారు. ఆ రాష్ట్రానికి చెందిన పార్టీలతో కనీసం సమావేశం కూడా నిర్వహించలేదన్నారు.